మెదక్: రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సోమవారం జిల్లా పర్యటనకు విచ్చేస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ఆయన జిల్లాకు వస్తుండడంతో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మేరకు జిల్లా యంత్రాంగం తగు ఏర్పాట్లు చేపట్టింది. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నుంచి హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం 2.15 నిమిషాలకు జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన మెదక్ మండల పరిధిలోని పాషాపూర్ గ్రామానికి చేరుకుంటారు. జిల్లాలో భూ ప్రక్షాళన సర్వే తీరుతెన్నులను పరిశీలిస్తారు. ఈ సందర్భంగా గ్రామంలో రైతులతో ముఖాముఖి సంభాషించనున్నారు. అనంతరం 4.20 నిమిషాలకు అక్కడి నుంచి బయల్దేరి హెలిపాడ్ వద్దకు చేరుకోనున్నారు. తర్వాత హైదరాబాద్కు తిరుగు ప్రయాణం కానున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm