హైదరాబాద్ : ప్రతి పోలింగ్ స్టేషన్ లో శని, ఆదివారాల్లో ఓటర్ల నమోదు, తొలగింపు కార్యక్రమం చేపడతామని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్థన్ రెడ్డి తెలిపారు. గత మూడు నెలలుగా హైదరాబాద్ లో జరుగుతున్న ఓటర్ల నమోదు, తొలగింపు కార్యక్రమంపై నగరంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులతో జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి ఇవాళ సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీల నాయకులు ఇచ్చిన సూచనలు తీసుకొని ఓటర్ల నమోదు, తొలగింపు కార్యక్రమం చేపడతామని తెలిపారు. బోగస్, మార్చుకున్న ఓట్లతో పాటు చనిపోయిన వారి ఓట్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెడతామన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm