భద్రాద్రి కొత్తగూడెం: పేకాట ఆడుతున్న 10 మంది వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెంలో చోటుచేసుకుంది. గరీబుపేట గ్రామం దగ్గరలోని ఒక జామయిల్ తోటలో పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు కొత్తగూడెం 2టౌన్ సీఐ సీహెచ్.శ్రీనివాస్ తన సిబ్బందితో కలిసి రైడ్ చేశాడు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న పది మంది వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురు వ్యక్తులు పరారయ్యారు. నిందితుల వద్ద నుంచి రూ. 4,200 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm