మేడ్చల్: స్కూటర్పై వెళ్తున్న దంపతులపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా కీసర మండలం కరీంగూడాలో చోటుచేసుకుంది. భార్యభర్తలు స్కూటర్పై వెళ్తుండగా పల్సర్ బైక్పై నుంచి వ్యక్తి అడ్డగించి వారిపై దాడికి పాల్పడ్డాడు. మహిళ మెడలోంచి మంగళసూత్రం అపహరించేందుకు ప్రయత్నించగా అటుగా వచ్చిన వ్యక్తులను చూసి దుండగుడు పారిపోయాడు. గాయపడిన దంపతులను పోలీసులు ఆస్పత్రికి తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm