నాగర్కర్నూల్: కొల్లాపూర్ మండల పరిధిలోని ఎల్లూరు గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన టిప్పర్ అదుపుతప్పి కాల్వలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm