హైదరాబాద్: ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున సోదరి నాగ సుశీల పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. చింతలపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి అనుమతి లేకుండా తన భూములను విక్రయించాడని పంజాగుట్ట పోలీసులకు నాగ సుశీల ఫిర్యాదు చేశారు. తన సంతకాలను ఫోర్జరీ చేసి మోసానికి పాల్పడ్డాడని, అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నాగ సుశీల తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నాగ సుశీల ఫిర్యాదుతో శ్రీనివాస్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm