థానే: విద్యాబుద్ధులు నేర్పాల్సిన అధ్యాపకుడే కూతురు వయసున్న ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాదు.. అదీ విజ్ఞానాన్ని అందించే వేదికైన మదర్సాలో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. చివరికి విద్యార్థి తల్లి ఫిర్యాదు మేరకు కటకటాల పాలయ్యాడు. ఈ దారుణం మహారాష్ట్రలోని థానే సమీపంలో ముంబ్రాలో చోటుచేసుకుంది. బిహార్కు చెందిన 35 ఏళ్ల అరబిక్ అధ్యాపకుడు 15 రోజుల క్రితమే ఇక్కడి మదర్సాలో విధుల్లో చేరాడు. చిన్నారులకు అక్షరాలను నేర్పాల్సిన ఆ వ్యక్తి ఓ ఐదేళ్ల చిన్నారిపై కన్నేశాడు. వారం క్రితం ఆ చిన్నారిపై మదర్సా లోపల అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ద్వారా విషయం తెలుసుకున్న చిన్నారి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ముంబ్రా పోలీసులు ఆ మృగాడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm