హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అర్థరాత్రి తాగుబోతులు హంగామా చేశారు. ఇండిగో ఎయిర్లైన్స్కు చెందిన ఉద్యోగిని పట్ల మద్యం మత్తులో ఉన్న ఐదుగురు యువకులు అసభ్యంగా ప్రవర్తించారు. బాధితురాలు ధైర్యం చేసి సమీపంలో ఉన్న ట్రాఫిక్ పోలీసుల ఔట్పోస్ట్ వద్దకు వెళ్లి సాయం కోరింది. దీంతో వారు నిందితులను పట్టుకుని శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులకు అప్పగించారు. మద్యం మత్తులో తప్పుగా ప్రవర్తించామని నిందితులు బాధితురాలి కాళ్లు పట్టుకుని ప్రాధేయపడ్డారు. నిందితులను బంజారాహిల్స్, అమీర్పేట, శ్రీనగర్ కాలనీకి చెందిన వారుగా గుర్తించారు. వీరు రక్షణ శాఖకు ఎలక్ట్రానిక్ పరికరాలు సరఫరా చేస్తుంటారని చెబుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm