ప్రకాశం జిల్లా: రైతుల కోసం ప్రభుత్వం ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా అధికారుల నిర్లక్ష్యంతో అవి క్షేత్రస్థాయిలో జరగడంలేదని, దీంతో తామంతా నష్టపోవాల్సి వస్తోందని ప్రకాశం జిల్లా రైతులు ఆరోపించారు. కనిగిరి నియోజయవర్గంలో సుమారు 30 ఎకరాల్లో మినుము పంటను రైతులు సాగు చేస్తుండగా తెగులు వచ్చింది. ఎన్ని మందులు వాడినా ఫలితం లేకపోవడంతో ఆధికారులను రైతులు ఆశ్రయించారు. వారు స్పందించకపోవడంతో ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm