హైదరాబాద్ : పెళ్ళి అయిన నాలుగంటే నాలుగు రోజులకు వారి దాంపత్య జీవితం ముగిసిపోయింది. భార్యను కాలీజీలో వదిలిపెట్టడానికి వెళ్ళాడు. కానీ రోడ్డు ప్రమాదంలో ఆమె అసువులు బాసింది. దాదాపు అరగంట పాటు భర్త ఆమెను కాపాడుకోడానికి ఎంతగానో ప్రయత్నించాడు. కానీ ఆమె ప్రాణాలు నిలబడలేదు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని కాంగడా జిల్లాలోని ఇందౌరాలో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. 21 సంవత్సరాల అల్కా దేవిని ఆమె భర్త సునీల్ కుమార్ బైక్ లో కాలేజీలో వదిలిపెట్టడానికి బయలుదేరాడు. అయితే మార్గమధ్యమంలో అతడు ఓ బస్ ను ఓవర్ టెక్ చేస్తుండగా బైక్ స్కిడ్ అయింది. దీంతో ఆమె బస్సు చక్రాల కిందకు వెళ్ళింది. దీంతో ఆమె తీవ్ర గాయాలపాలై కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడింది. దాదాపు అరగంట పాటు భర్త ఆమెను కాపాడడం కోసం ఎంతగానో ఎదురుచూశాడు. 108 అంబులెన్స్ రావడంతో ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆమె ప్రాణాలు విడిచింది. 21 సంవత్సరాల అల్కా దేవికి నాలుగు రోజుల క్రితం నవంబర్ 14న సునీల్ కుమార్ తో వివాహం అయ్యింది. ఆమె బిఎస్సీ చదువుతూ ఉంది. ఆమే కాలేజీకి వెళ్ళాలని చెప్పడంతో విడిచిపెట్టడానికి వస్తానని చెప్పి భర్త కూడా బయలుదేరాడు. ఇంతలో ఆమె ఇలా ప్రమాదానికి గురైంది. దాదాపు అరగంట పాటు ఆమెను రక్షించడానికి ఎవరైనా రాకపోతారా అని ఆమె భర్త ఎదురుచూశాడు. అంబులెన్స్ అర గంట తర్వాత రావడంతో ఆమెను కాపాడడం కష్టమైంది.
Mon Jan 19, 2015 06:51 pm