కోల్కతా: భారత్-శ్రీలంక మధ్య జరిగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజున లంక ఆటగాడు పెరీరా తీరు పలు విమర్శలకు దారి తీసింది. 53వ ఓవర్లో లంక బ్యాట్స్మెన్ పెరీరాను అంపైర్ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించిన తర్వాత డ్రెస్సింగ్ రూం వైపు వెళ్తు.. మళ్లీ వెనక్కి తిరిగి అంపైర్ని రివ్యూ కోరాడు. అయితే డ్రెస్సింగ్ రూం నుంచి సూచన తీసుకొని పెరీరా రివ్యూ కోరాడని విమర్శలు వచ్చాయి. ఈ విషయంపై లంక క్రికెట్ బోర్డు 'శ్రీలంక క్రికెట్' స్పందించింది. తమ ఆటగాడు పెరీరా ఎటువంటి తప్పు చేయలేదని లంక క్రికెట్ బోర్డు సమర్థించుకున్నట్లు ఉన్నా ఓ ఫోటో ప్రస్తుతం సోషల్మీడియాలో హల్చల్ చేస్తోంది. అందులో 'పెరీరా వికెట్ కోల్పోయిన సమయంలో అతను రివ్యూలు అయిపోయాయని భావించి డ్రెస్సింగ్ రూం వైపు వెళ్లాడని, అయితే మరో ఆటగాడు... రంగనా హెరాత్ రివ్యూలు ఉన్నాయని తెలపడంతో అతడు అంపైర్ని రివ్యూ కోరాడని. అంతేకాని.... పెరీరా డ్రెస్సింగ్ రూం నుంచి ఎటువంటి సూచన తీసుకొలేదని.... లంక ఆటగాళ్లు ఎప్పుడూ క్రికెట్ నిబంధనలని అతిక్రమించరని, క్రీడాస్పూర్తికి కట్టుబడి ఉంటారని్ణ్ణ లంక క్రికెట్ బోర్డు రాసినట్లు ఉంది. అయితే శ్రీలంక క్రికెట్ వెబ్సైట్లో కాని సోషల్మీడియా అకౌంట్లలో కానీ దీనికి సంబంధించిన సమాచారం లేదు.
Mon Jan 19, 2015 06:51 pm