వికారాబాద్: తాండూరులో రూ. 2.50 కోట్ల నిధులతో ఇండోర్ స్టేడియాన్ని నిర్మించనున్నట్లు మంత్రి మహేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. తాండూరులో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ 63వ తెలంగాణ రాష్ట్ర స్థాయి తైక్వాండో, టెన్నిస్, వాలీబాల్ పోటీలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.... రాష్ట్రంలో క్రీడా వికాసానికి సీఎం కేసీఆర్ కోట్లాది నిధులు అందిస్తున్నారన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులకు తెలంగాణలో బంగారు భవిత ఉంటుందన్నారు. గ్రామీణ క్రీడాకారుల కోసం ప్రతీ మండలంలో మినీ స్టేడియాలను అభివృద్ధి పరుస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం యువతను ఆకట్టుకుంటున్న టెన్నిస్, వాలీబాల్ క్రీడను ప్రోత్సహిస్తామని మంత్రి తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm