హైదరాబాద్ : తెలంగాణలో ప్రాజెక్టుల డిజైన్లు ప్రజా అవసరాల కోసం కాకుండా..కాంట్రాక్టర్ల అవసరాల కోసం మారుతున్నాయని టీజాక్ ఛైర్మన్ కోదండరామ్ ఆరోపించారు. హైదరాబాద్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ భవనంలో కృష్ణానది జలాల పునర్ పంపిణీపై పాలమూరు అధ్యయన వేదిక సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో కోదండరామ్, ప్రొఫెసర్ హరగోపాల్, సారంపల్లి మల్లారెడ్డి పాల్గొన్నారు. అన్ని జిల్లాలకు నీటిని న్యాయంగా పంపిణి చేయడానికి ప్రభుత్వం కొత్త పార్ములా రూపుపొందించాలని వక్తలు సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm