గచ్చిబౌలి: హైటెక్సిటీలో నగరవాసుల కోసం పాలపిట్ట సైక్లింగ్ పార్కు సిద్ధమైంది. పచ్చని చెట్ల నడుమ, చెరువు గట్టు మీదుగా ఆహ్లాదకర వాతావరణంలో సైకిల్ తొక్కేందుకు 3 కిలోమీటర్ల ట్రాక్ను తీర్చిదిద్దారు. పార్కును సోమవారం మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. కొత్తగూడలోని కోట్ల విజయభాస్కరరెడ్డి బొటానికల్ గార్డెన్లో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పాలపిట్ట సైక్లింగ్ పార్క్ను దాదాపు 30 ఎకరాల విస్తీర్ణంలో తీర్చిదిద్దారు. ఒకప్పుడు ముళ్లకంపలు, పిచ్చిమొక్కలతో నిండి ఉండే ప్రాంతాన్ని అందంగా తీర్చిదిద్దారు. హరితహారంలో భాగంగా దాదాపు 7 వేల మొక్కలను ఇక్కడ నాటడంతో ఆహ్లాదకర వాతావరణం కనిపిస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Nov 20,2017 07:28AM