హైదరాబాద్ : ఫోర్జరీ సంతకాలతో కోట్ల రూపాయలు విలుచేసే భూమిని లాక్కున్నారు. ఇదేమని అడిగితే దిక్కున్న చోట చెప్పుకోమని బెదిరించారు. ప్రశ్నిస్తే చంపేస్తామని హెచ్చరించారు. సమీప బంధువులే ఓ ఎన్ఆర్ఐను నమ్మించి మోసం చేశారు. దీంతో హైదరాబాద్ సోమాజిగూడలోని ది పార్క్ హోటల్ స్థలం వివాదంగా మారింది.హైదరాబాద్ సోమాజిగూడలో రాజ్భవన్ రోడ్డులోనిది. 40కోట్ల రూపాయలు విలువచేసే ఈ స్థలంలో ది పార్క్ ఫైవ్స్టార్ హోటల్ నడుస్తోంది. వాస్తవంగా ఈ స్థలం తనదని ఎన్ఆర్ఐ జునైల్ ఆదిల్ చెప్తున్నారు. తన మేనల్లుడు నాజిర్ అలీఖాన్, మీర్ హుస్సేన్ అలీఖాన్కు జునైద్ ఈ విలువైన భూమిని అప్పగించారు. 1977లోనే దుబాయిలో స్థిరపడ్డ జునైద్... 2005లో అమెరికాకు వెళ్లి తన కుటుంబంతో కలిసి నివాసముంటున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm