కోల్కతా: ఈడెన్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమిండియా ఓపెనర్ లోకేశ్ రాహుల్ 79 125 బంతుల్లో 8*4 ఔటయ్యాడు. ఓవర్నైట్ వ్యక్తిగత స్కోరు 73తో ఐదో రోజు, సోమవారం బ్యాటింగ్ ఆరంభించిన రాహుల్ మరో ఆరు పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. లక్మల్ వేసిన 44.2వ బంతికి అనూహ్యంగా బౌల్డ్ అయ్యాడు. టీమిండియా నయావాల్ ఛెతేశ్వర్ పుజారా (16బీ 35 బంతుల్లో 3ఐ4) నిలకడగా ఆడుతున్నాడు. సారథి విరాట్ కోహ్లీ (7బీ 7 బంతుల్లో) క్రీజులో ఉన్నాడు. ప్రతి టెస్టులోనూ చక్కగా బ్యాటింగ్ చేస్తున్న రాహుల్ అర్ధశతకం తర్వాత తరచూ ఔటవుతున్నాడు. 47 ఓవర్లు ముగిసే సరికి భారత్ 199/2తో ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm