న్యూఢిల్లీ : భారత్లో భారీ ఉగ్రదాడికి ఐఎస్ఐ కుట్ర చేసినట్లు నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. ప్రధాని, ఉప రాష్ట్రపతి, ఇతర బీజేపీ కీలక నేతలను ఉగ్రవాదులు టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది. గుజరాత్ ఎన్నికల సందర్భంగా ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. గుజరాత్తో పాటు సముద్ర తీర ప్రాంతంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
26/11 ముంబయి దాడి తరహాలో గుజరాత్లో దాడులు చేసేందుకు లష్కరే తోయిబా ఉగ్రవాదులు కుట్ర చేసినట్లు నెల రోజుల క్రితం నిఘా వర్గాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. గుజరాత్ తీర ప్రాంతంలోకి ఉగ్రవాదులు.. జాలర్ల రూపంలో ప్రవేశించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీలను లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అంతే కాదు మత విద్వేషాలను రెచ్చగొట్టి.. గుజరాత్లో భయానక వాతావరణం సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సముద్ర తీరప్రాంతంలో భద్రత పెంచాలని ఆ రాష్ట్ర పోలీసులను నిఘా వర్గాలు హెచ్చరించాయి. పాకిస్థాన్ నుంచి ప్రతి పడవను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండాలని నిఘా వర్గాలు సూచించాయి. గుజరాత్ ఎన్నికలు డిసెంబర్ 9, 14 తేదీల్లో జరగనున్న విషయం తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Nov 20,2017 12:19PM