కోల్కతా: టీమిండియా బ్యాట్స్మన్ చతేశ్వర్ పుజారా అరుదైన రికార్డు సృష్టించాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్లో ఐదు రోజులూ బ్యాటింగ్ చేసిన బ్యాట్స్మన్గా పుజారా నిలిచాడు. ఈ ఘనత సాధించిన మూడో ఇండియన్ బ్యాట్స్మన్గా రికార్డు బుక్కుల్లోకెక్కాడు. పుజారా కంటే ముందు ఎంఎల్ జయసింహ, ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి ఈ అరుదైన ఘనత సాధించారు. తొలి రోజు తొలి బంతికే రాహుల్ ఔటవడంతో పుజారా క్రీజులోకి వచ్చిన విషయం తెలిసిందే. తొలి రోజు కేవలం 11.5 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం కావడంతో అతను నాటౌట్గా నిలిచాడు. రెండో రోజు కూడా కేవలం 21 ఓవర్ల ఆటే సాగడంతో ఓవైపు వికెట్లు పడిపోయినా.. పుజారా మాత్రం క్రీజులో నిలదొక్కుకున్నాడు. చివరికి మూడో రోజు తొలి ఇన్నింగ్స్లో 52 పరుగులు చేసిన తర్వాత ఔటయ్యాడు. ఇక నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్లో శిఖర్ ధావన్ ఔటవడంతో క్రీజులోకి వచ్చిన పుజారా.. ఐదో రోజు 22 పరుగులు చేసిన తర్వాత ఔటయ్యాడు. ఇలా టెస్ట్ మ్యాచ్లో ప్రతి రోజు ఆడిన ఘనతను అతను సొంతం చేసుకున్నాడు.
Mon Jan 19, 2015 06:51 pm