మేడ్చల్: బోడుప్పల్లో టీఆర్ఎస్ నేత శ్రీనివాసరెడ్డి ఇంటి ఎదుట రెండో భార్య సంగీత ఆందోళన కొనసాగిస్తోంది. తనకు, తన కూతురికి న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేసింది. సంగీతకు మూడో భార్య శిరీష, ఐద్వా నేతలు మద్దతు తెలిపారు. మాయమాటలు చెప్పి శిరీషనులోబర్చుకున్నాడని శిరీష తల్లి ఆరోపించింది. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ శ్రీనగర్ కాలనీలో నివాసం ఉండే పులకండ్ల శ్రీనివాస్రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో యువజన విభాగంలో పనిచేస్తున్నాడు. శ్రీనివాస్రెడ్డికి చందానగర్కు చెందిన సంగీతను నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. అయితే వీరికి రెండేళ్ల క్రితం ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్ల పుట్టిందని తన భార్యను శ్రీనివాస్రెడ్డి వేధించేవాడు. ఆదివారం శ్రీనివాస్రెడ్డి మరొక యువతిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకువచ్చాడు. ఇదేంటని ప్రశ్నించిన సంగీతను దారుణంగా కొట్టి ఇంటినుండి గెంటివేశాడు. తీవ్రగాయాల పాలైన సంగీత తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఇంటి ముందు ఆందోళన చేపట్టింది. దీంతో శ్రీనివాస్రెడ్డి ఇంటి నుండి పరారయ్యాడు.
Mon Jan 19, 2015 06:51 pm