ఉత్తరాఖండ్: సెల్ఫీ క్రేజ్తో ఓ యువకుడు తన ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు. నరేన్ అనే ఐఐటీ విద్యార్థి ఉత్తరాఖండ్లోని చెల్లా జలాశయం వద్ద సెల్ఫీ దిగుతూ ప్రమాదవశాత్తు అందులో పడి గల్లంతయ్యాడు. మూడు రోజుల కిత్రం గల్లంతవడంతో..అధికారులు గాలింపు చేపట్టి నరేన్ మృతదేహాన్ని వెలికి తీశారు. నరేన్ ఢిల్లీలో ఐఐటీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. నరేన్ హైదరాబాద్ ఎంజే మార్కెట్ వాసిగా గుర్తించారు. మృతదేహాన్ని హైదరాబాద్ తరలించేందుకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేశారు. నరేన్ మృతితో మొజాంజాహి మార్కెట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. నరేన్ ఈ నెల 18న స్నేహితులతో కలిసి ఉత్తరాఖండ్ విహారయాత్రకు వెళ్లాడు.
Mon Jan 19, 2015 06:51 pm