రామగుండం: పాతనోట్లను మార్చి కొత్తనోట్లు ఇస్తామని నమ్మిస్తు ప్రజలను మోసం చేస్తున్న ముఠాను పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.19లక్షల రద్దయిన రూ.500, రూ.వెయ్యినోట్లను స్వాధీనం చేసుకున్నారు. సీఐ వాసుదేవరావు కథనం ప్రకారం.. మహారాష్ట్ర సిరోంచాకు చెందిన జమీల్హుస్సేన్(37), షఫీక్ అంకుస్(28), తులసిగిరి మధుకర్, మంచిర్యాలకు చెందిన నేరేళ్ల మనోహార్(39), గోదావరిఖని అశోక్నగర్కు చెందిన బాలసాని రమేశ్(39) ముఠాగా ఏర్పడి కొంతకాలంగా, ఈ ప్రాంతంలో పాతనోట్లను సేకరిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ప్రజల నుంచి సేకరించి అక్రమంగా డబ్బు సంపాదించుటకు ప్రయత్నిస్తున్నారు. రామగుండం ఎస్ఐలు రాజ్కుమార్గౌడ్, సాబిర్, సిబ్బంది పక్కాసమాచారం మేరకు రామగుండం రైల్వేస్టేషన్లో పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రద్దయిన వెయ్యి, రూ.500 నోట్లు మొత్తం రూ.19లక్షలు స్వాధీనం చేసుకున్నారు. రూ.19లక్షల పాతనోట్లను మార్పిడికి చూస్తున్న ముఠా రామగుండం పోలీసులుకు చిక్కడం పారిశ్రామిక ప్రాంతంలో సంచలనమైంది.
Mon Jan 19, 2015 06:51 pm