హైదరాబాద్: 80 గజాల స్థలం.. నిర్మాణం చేస్తుంది మాత్రం ఏడంతస్తులు. పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేయొద్దని టౌన్ప్లానింగ్ అధికారులు భవన యజమానికి నోటీసులు జారీ చేసినా స్పందించలేదు. దీంతో టౌన్ప్లానింగ్ అధికారులు సోమవారం ఆ భవనంలో కూల్చివేతలు చేపట్టారు. కృష్ణానగర్ బీ బ్లాక్ శ్రీ సాయికిరణ్ స్కూల్ వద్ద చిన్నపాటి స్థలంలో జి ప్లస్ 6 నిర్మాణం చేస్తున్నారు.
నిర్మాణదారుడికి టౌన్ప్లానింగ్ అధికారులు రెండు సార్లు నోటీసులు జారీ చేశారు. అయినా స్పందించకపోవడంతో శనివారం మూడో నోటీసు ఇచ్చారు. టౌన్ప్లానింగ్ ఏసీపీ వెంకన్న సెక్షన్ ఆఫీసర్ మణిహారిక సిబ్బందితో వచ్చి అక్రమ నిర్మాణాన్ని కూల్చివేతలు చేపట్టారు. భవనం పైన రెండు (5, 6) అంతస్తులు కూల్చివేశారు. అక్రమ నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది క్రాంతి, శ్రీనివాస్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Nov 21,2017 09:06AM