హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు హైకోర్టును ఆశ్రయించారు. ఈ ప్రాజెక్టును పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే నిర్మించేలా ఆదేశాలు జారీచేయాలని కోరారు. జాతీయ ప్రాజెక్టు కాబట్టి కేంద్రమే పూర్తిగా భరించాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోనూ ఇదే విషయాన్ని స్పష్టంచేశారని ఆయన వివరించారు. కేవీపీ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ఉన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. పోలవరం ప్రాజెక్టుపై తమ వైఖరి ఏమిటో తెలపాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Mon Jan 19, 2015 06:51 pm