ముంబై: పాజిటివ్ సంకేతాలతో లాభాలతో ప్రారంభమైన మంగళవారం నాటి స్టాక్ మార్కెట్లు, చివరికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా లాభంలో 118.45 పాయింట్లు బలపడి 33,478 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 28.15 పాయింట్ల లాభంలో 10,300కి పైన 10,326 వద్ద క్లోజైంది. ప్రపంచ ఆర్థిక వృద్ధిపై ఆశలతో అమెరికా నుంచి ఆసియా వరకూ మార్కెట్లు పుంజుకోవడంతో దేశీయంగానూ సానుకూల ధోరణి కనిపించింది.
Mon Jan 19, 2015 06:51 pm