హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు సంజయ్లీలా భన్సాలీ చరిత్రను వక్రీకరించి కించపర్చేలా నిర్మించిన 'పద్మావతి' చిత్రాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిషేధించాలని భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్తో హైదరాబాద్ బేగంబజార్లోని భూలక్ష్మి దేవాలయం నుంచి హైదరాబాద్ కలెక్టరేట్ వరకు రాజాసింగ్ ర్యాలీ నిర్వహించారు. మార్గమధ్యలోనే అడ్డుకున్న పోలీసులు రాజాసింగ్తోపాటు ఆయన అనుచరులను అరెస్టు చేశారు. క్షత్రియుల శౌర్యం, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకైన రాణి పద్మావతి చరిత్రను వక్రీకరించి చిత్రంగా తీయడం వల్ల క్షత్రియుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ చిత్ర ప్రదర్శనను నిలిపివేసేలా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm