హైదరాబాద్: పెళ్లయిన వారం రోజుల నుంచే భార్యను భర్త, మరిది, అత్తమామలు వేధించడం మొదలుపెట్టారు. ఏడాది భరించిన బాధితురాలు తట్టుకోలేక నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ రాచకొండ పోలీసులను ఆశ్రయించింది. ఘట్కేసర్ ఇన్స్పెక్టర్ బి. ప్రకాష్ తెలిపిన వివరాల ప్రకారంౌ ఘట్కేసర్ మండలం ప్రతాప్సింగారం గ్రామానికి చెందిన అశ్విని(26)ని పోచారం పంచాయతీలోని అన్నోజిగూడకు చెందిన బాలగోని సమన్గౌడ్తో గత ఏడాది డిసెంబర్ 8న వివాహం జరిగింది. ఆసమయంలో అశ్విని తల్లిదండ్రులు రూ.3లక్షల నగదు, 25 తులాల బంగారు ఆభరణాలు కట్నం కింద ఇచ్చారు. వివాహమైన ఐదురోజుల తరువాత భార్యాభర్తలు తిరుపతి వెళ్ళారు. అక్కడి నుంచి తిరిగి వచ్చారు. ఆ తరువాత ఆమెతో కాపురం చేయడంపై ఆసక్తి లేదని, ఆమెకు అక్రమ సంబంధం ఉందని భర్త సుమన్ ఆరోపించాడు. పురుగుల మందు తాగాలని, ఉరేసుకోవాలని వేధింపులు అధికం చేశాడు. అత్తమామలు, ఆడపడుచు అదనపు కట్నం తీసుకోవాలని నిత్యం ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సుమన్ సోదరుడు నవీన్ పలుమార్లు కోరిక తీర్చాలంటూ వేధింపులకు గురిచేశాడు. ఓ రోజు రాత్రి 11:30కు బయటకు వెళ్ళిన భర్త కోసం వేచి ఉండగా నవీన్ తనను పడక గదిలోకి తీసుకెళ్ళేందుకు ప్రయత్నించాడని అశ్విని పోలీసులకు ఫిర్యాదు చేసింది. భౌతికంగా, మానసికంగా వేధిస్తున్న భర్త సుమన్, అతని సోదరుడు నవీన్, అత్త మామలు శకుంతల, శంకరయ్య, ఆడపడుచు ప్రతిభలపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ బి.ప్రకాష్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm