సూర్యాపేట: పేకాట ఆడుతున్న 13 మంది వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం గుండ్లపాడులో చోటుచేసుకుంది. గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారంపై పోలీసులు రైడ్ చేశారు. నిందితుల వద్ద నుంచి 11 సెల్ ఫోన్లు, 4 బైక్లు, ఒక కారు, రూ. 1,43,000 వేల నగదును పోలీసులు స్వాధీన చేసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm