బేతంచర్ల: వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పటిన ప్రజాసంకల్పయాత్ర 14వరోజు కర్నూలు జిల్లా బేతంచర్లకు చేరుకుంది. బేతంచర్లలో జరిగిన సభలో జగన్ ప్రసంగింస్తూ... ఆరోగ్యశ్రీని చంద్రబాబు అనారోగ్యశ్రీగా మార్చారని ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి రాగానే భ్రష్టు పట్టిన ఆరోగ్య వ్యవస్తను మారుస్తామని, ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రక్షాళన చేసి, 104,108 సేవలను మెరుగు పరుస్తామని హామియిచ్చారు. 'ఏ ఆపరేషన్ అయినా ఉచితంగా చేయిస్తా. చిరునవ్వుతో ఇంటికి పంపిస్తా. మూగ, చెవుడు పిల్లలకు ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తాం. కేన్సర్, గుండె, న్యూరో సమస్యలకు కూడా ఉచితం ఆపరేషన్లు చేయిస్తాం. కిడ్నీ రీప్లేస్మెంట్కు ఉచితంగా ఆపరేషన్లు చేయించడంతో పాటు శస్త్రచికిత్స సమయంలో అవసరమైతే కొంత డబ్బు ఇచ్చి బాధితులను ఆదుకుంటాం. కిడ్నీ రోగులకు అన్నిరకాలు తోడుగా ఉంటాం. వారికి నెలకు రూ. 10 వేలు పెన్షన్గా ఇస్తాం. 104 ద్వారా అన్నిరకాల మందులు ఇస్తాం. మీ అమూల్యమైన సూచనలు, సలహాలతో రెండుమూడు పేజీల్లో మేనిఫెస్టో తీసుకొచ్చి అందులోని ప్రతి అంశాన్ని అమలు చేస్తామ్ణని వైఎస్ జగన్ భరోసాయిచ్చారు.
Mon Jan 19, 2015 06:51 pm