నైజీరియా: నైజీరియాలో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు ఒడిగట్టారు. ముబిలోని ఉంగువార్ శువా ఏరియా మసీదులో ప్రార్థనలు కొనసాగుతుండగా ఓ ఉగ్రవాది తనను తాను పేల్చుకున్నాడు. ఈ దాడిలో 50 మంది మృతి చెందారు. చాలా మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం వివిధ ఆస్పత్రులకు తరలించామని పోలీస్ అధికారి అబూబాకర్ తెలిపారు. బొకోహారమ్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులు జరిపినట్లుగా నైజీరియన్ భద్రతా దళాలు భావిస్తున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm