గుంటూరు: గుంటూరు అంకమ్మనగర్లో ఉద్యోగి నన్నవ రవికుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. పీహెచ్సీ సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న రవికుమార్ ఉన్నతాధికారుల వేధింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఓ వీడియోను ఫేస్బుక్లో పోస్టు చేశారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న రవికుమార్ను ఏడాది కిందట పొన్నూరుకు బదిలీ చేశారు. ఆయన తిరిగి గుంటూరుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకోసం ఉన్నతాధికారులు రూ.లక్ష లంచం అడిగారని, తాను ఇప్పటికే రూ.70వేలు ఇవ్వగా దాన్ని మధ్యవర్తులు మింగేశారని రవికుమార్ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. రెండురోజుల క్రితం ఆత్మహత్యకు యత్నించిన ఆయన గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం మృతిచెందారు. రవికుమార్ ఆత్మహత్యకు నిరసనగా దళిత సంఘాలు జీజీహెచ్ వద్ద ఆందోళన చేపట్టాయి. ఆయన ఆత్మహత్యకు కారణమైన వారిని శిక్షించాలని భార్య పుష్పలత, కుమార్తెలు, బంధువులు, దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm