హైదరాబాద్: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాతో పాటు టెక్సాస్ గవర్నర్ గ్రేగ్ అబోట్ ను చంపేందుకు ప్రయత్నించిందని చెబుతూ జూలియా ఫోఫ్ (46) అనే మహిళను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో కలకలం రేగింది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే... ఒబామా, అబోట్ లకు పార్సిళ్లు వచ్చాయి. ఆ పార్సిల్స్ అందుకున్న భద్రతా సిబ్బంది, వాటిని బాంబులుగా గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో ఆపార్సిల్స్ ఎలా వచ్చాయి?. ఎక్కడి నుంచి వచ్చాయి?. వంటి వివరాలపై దర్యాప్తు చేయగా కొరియర్ కంపెనీ సీసీ పుటేజ్ లో జూలియా ఫోఫ్ ఈ పార్సిల్స్ పంపిందని తేలింది. వారిద్దరినీ హతమార్చేందుకు పార్సిళ్లలో బాంబులు ప్యాక్ చేసి పంపిందని తేలింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఇది టెక్సాస్ లో కలకలం రేపింది.
Mon Jan 19, 2015 06:51 pm