హైదరాబాద్: అవినీతి ఆరోపణలు చేయడం కాంగ్రెస్ ఫ్యాషనైపోయిందని, మేం ఎంత నిజాయతీగా ఉన్నామో జనాలకు తెలుసు అని రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. గురువారం ఇండియా టుడే నిర్వహించిన కాన్ క్లేవ్ లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... బిల్లులు లేకుండా 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. మేం అధికారంలోకి వచ్చాక 5 వేల పరిశ్రమలు వచ్చాయని, ఇప్పటికే 2 వేల పరిశ్రమలు పనిచేస్తున్నాయని సీఎం అన్నారు. అలాగే తెలంగాణలో అధికారంలోకి వస్తామంటున్న బీజేపీ.. వారి ప్రయత్నాలు వాళ్లు చేసుకోవచ్చని, ఇదంతా రాజకీయాల్లో సహజం అని కేసీఆర్ పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm