ఇస్లామాబాద్ : పాకిస్థాన్లో మరో ఘోరం చోటుచేసుకుంది. బాలలకు పోలియో చుక్కలు వేస్తున్న ఇద్దరు మహిళా వైద్యసిబ్బందిని ఉగ్రవాదులు కాల్చిచంపారు. పాక్లో పోలియో వ్యాధి ఎక్కువగా ఉంది. దీంతో ఈ వ్యాధిని పారదోలేందుకు ఐరాస ఆధ్వర్యంలో పలు వైద్యసంస్థలు యత్నిస్తున్నాయి. క్వెట్టా సమీపప్రాంతంలో వైద్య విభాగానికి చెందిన షకినా బీబీ, ఆమె కుమార్తె అలీజాతో కలిసి బాలలకు పోలియో చుక్కలు వేస్తుండగా మోటార్సైకిల్పై వచ్చిన ఇద్దరు దుండగులు వారిపై కాల్పులు జరిపినట్టు సమాచారం. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే కన్నుమూసినట్టు తెలుస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm