విజయవాడ: గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించనున్నామని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి పి. అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. శుక్రవారం గన్నవరం నుంచి ముంబైకి నూతనంగా ఏర్పాటుచేసిన విమాన సర్వీసును ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ... గన్నవరం విమానాశ్రయంలో నెల రోజుల్లో కార్గో సేవలు ప్రారంభిస్తామన్నారు. సీ ఫ్లైట్స్, డ్రోన్లపై త్వరలో విధివిధానాలు రూపొందిస్తామన్నారు. అలాగే దేశ ఆర్థిక రాజధాని ముంబైతో అమరావతికి అనుసంధానం ఏర్పడిందని కేంద్రమంత్రి పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm