ఆదిలాబాద్ : గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్ నాగోబా జాతరలో ప్రతి సంవత్సరం నిర్వహించే దర్బార్ ప్రారంభమైంది. దీనికి బీసీ సంక్షేమ, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ నగేశ్, ఖానాపూర్, బోథ్, ఆసిఫాబాద్, ఎమ్మెల్యేలు రేఖానాయక్, రాథోడ్ బాపురావు, కోవ లక్ష్మి , ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ కలెక్టర్లు డి.దివ్య, ఆర్వీ కర్ణన్, ప్రశాంత్ జీవన్ పాటిల్, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. మంత్రులు, అధికారులు, గిరిజన పెద్దలు దర్బార్లో మాట్లాడారు. భారీ సంఖ్యలో గిరిజనులు దర్బార్కు వచ్చి తమ సమస్యలపై విజ్ఞప్తులను ప్రత్యేక కౌంటర్లులో అందజేశారు.
Mon Jan 19, 2015 06:51 pm