చెన్నై: దక్షిణాఫ్రికాపై సిరీస్ ఓటమిపై భారత క్రికెట్ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ పెదవి విప్పాడు. తాజాగా చెన్నైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధోనీని సిరీస్ ఓటమిపై మాట్లాడాల్సిందిగా పలువురు కోరారు. దీనికి సరైన జవాబు నేను చెప్పలేను. కానీ, కొన్ని విషయాల గురించి మాట్లాడతా. టెస్టు మ్యాచ్లో విజయం సాధించాలంటే ముందు ప్రత్యర్థి జట్టు ఆటగాళ్ల 20 వికెట్లు పడగొట్టాలి. ఇందులో మనం విజయవంతం అయ్యాం. ఇది మనకు సానుకూలాంశమే. ఒకవేళ మనం 20 వికెట్లు తీయలేకపోతే ఆ టెస్టులో విజయం సాధించలేం. అది సొంతగడ్డ అయినా విదేశీ గడ్డ అయినా. ఎక్కడైనా సరే 20 వికెట్లు తీస్తేనే మ్యాచ్ విజయం కోసం పోరాడుతున్నట్లు. ఒకసారి మనం పరుగులు చేయడం ప్రారంభిస్తే..నువ్వు పోటీలో నిలిచినట్లే. అని ధోనీ వివరించాడు.
Mon Jan 19, 2015 06:51 pm