హైదరాబాద్: ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలను సస్యశ్యామలం చేయడానికి నిర్మించతలపెట్టిన సీతారామ ప్రాజెక్ట్ పనుల్లో ముందడుగు పడింది. ప్రాజెక్ట్ స్టేజ్-1కు అటవీ అనుమతులు జారీ చేస్తూ ప్రాంతీయ అటవీ సాధికార కమిటీ నిర్ణయం వెలువరించింది. సీతారామ ప్రాజెక్ట్ ప్రతిపాదనలపై సీఈ సుధాకర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్ర ప్రతిపాదనలపై అటవీ, పర్యావరణ ప్రాంతీయ కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. 1531 హెక్టార్ల అటవీభూమి నీటిపారుదలశాఖకు బదలాయించేందుకు అంగీకారం తెలిపింది. అనుమతులపై త్వరలోనే ఉత్తర్వులు జారీకానున్నాయి. మంత్రి హరీశ్ రావు, తుమ్మల నాగేశ్వరరావు అనుమతులపై హర్షం వ్యక్తం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm