ఢిల్లీ: దేశరాజధాని దిల్లీలోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిందిగా ఎన్నికల సంఘం (ఈసీ) రాష్ట్రపతికి సిఫార్సు చేయడాన్ని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు తప్పుబట్టారు. ఈసీ పీఎంవోకి లెటర్ బాక్స్లా మారిందని ఆప్ నేత అశుతోష్ ఆరోపించారు. కనీసం ఎమ్మెల్యేల వైపు వాదనను వినకుండా ఈసీ ఇలా ప్రవర్తించడం సరికాదంటూ ఆప్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీకి వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. అనర్హత వేటు వేయాలంటూ ఈసీ సిఫార్సు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆప్ 20 మంది ఎమ్మెల్యేలు శుక్రవారం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ను విచారించేందుకు న్యాయస్థానం అంగీకరించింది.
Mon Jan 19, 2015 06:51 pm