హైదరాబాద్: నగర శివారులోని వనస్థలిపురంలో శనివారం దారుణం చోటుచేసుకుంది. స్కూలు బస్ కిందపడి ఒకటో తరగతి చిన్నారి మృతిచెందింది. అంజలి అనే చిన్నారి వనస్థలిపురంలోని ప్రశాంతి విద్యానికేతన్ పాఠశాలలో చదువుతోంది. అయితే... శనివారం ఉదయం స్కూలుకు వెళ్లేందుకు బస్సు ఎక్కింది. అనంతరం డోర్ సమీపంలో నిల్చోగా డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో డోర్ లోనుంచి జారి పడగా బస్సు వెనుక చక్రం అంజలి మీదనుంచి వెళ్ళడంతో తల భాగం చిధ్రమై అక్కడికక్కడే మృతిచెందింది. కాగా.. అదే బస్ డోర్ వద్ద ఎవరైనా ఉంటే పాప ప్రాణాలు పోయేవి కావని తెలుస్తోంది. కాగా... పాఠశాలకు బయలుదేరిన తమ చిన్నారి మృత్యువాత చెందడం పట్ల తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు పలువురిని కంటతడిపెట్టించింది.
Mon Jan 19, 2015 06:51 pm