పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు కేంద్ర ప్రభుత్వం జడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించింది. ఈ భద్రత కింద ఆయనకు 35 నుంచి 40 మంది సాయుధ కమెండోలు రక్షణ కల్పిస్తుంటారు. ఆయన వెంట ఎప్పుడూ ఎస్కార్ట్ వాహనాలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన, ఇంటెలిజెన్స్ బ్యూరో చేసిన సెక్యూరిటీ ఆడిట్ అనంతరం నితీష్కు జడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. బీహార్లో ఇటీవల ఃసమీక్షా యాత్రఃలో నితీష్ పాల్గొన్నప్పుడు ఆయన కాన్వాయ్పై దాడి జరగింది. దీంతో ఆయనకు మరింత భద్రత పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. సెంట్రల్ సెక్యూరిటీ ఏజెన్సీతో హోం మంత్రిత్వ శాఖ సంప్రదింపుల అనంతరం జడ్ ప్లస్ భద్రత కల్పిస్తున్నవారిలో బీహార్ సీఎంను కూడా చేర్చాలనే నిర్ణయం తీసుకున్నట్టు హోం శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
Mon Jan 19, 2015 06:51 pm