పశ్చిమ బెంగాల్: పశ్చిమబంగాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. బంగాల్లోని బెల్దంగలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తూ నీటికుంటలో పడింది. ఈ ఘటనలో మరో 20 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్న వారిని రక్షించారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాసుపత్రులకు తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm