హైదరాబాద్ : అత్త అల్లుడు సంబంధం గురించి మన పురాణాలలో ఎంతో బాగా వర్ణిస్తారు.. కానీ అలాంటి సంబంధానికి ఓ అల్లుడు మచ్చ తెచ్చాడు.. పాపం అమాయకమైన అత్త మీద అఘాయిత్యం చేశాడు.. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం గోవిందాపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది.. ఎంతో కష్టపడి కూలి పని చేసుకునే ఆమె తన కూతురికి పెళ్లి చేసింది.. అలాగే ఆమెకు ఒక కొడుకు కూడా ఉన్నాడు.. ఆమెకు భర్త చనిపోయాడు.. ఆమె కూలి పని చేసుకుంటూ కుమారుడితో ఇంట్లో ఉండేది.. ఎప్పటిలాగే ఆమె కూలి పనికి వెళ్ళింది.. పని అవ్వగానే ఇంటికి తీసుకెళ్లామని కుమారుడికి ఫోన్ చేసింది.. కానీ అదే గ్రామంలో అల్లుడు కూడా ఉండడంతో అతనికి ఫోన్ చేసింది.. తాను అల్లుడి వెంట ఇంటికి వెళుతున్నానని కుమారుడికి చె ప్పి అతడి బైక్ ఎక్కింది.. అత్తపై కన్నేసిన అల్లుడు అవకాశం దొరికిందని ఆమెను బైక్ మీద తీసుకెళ్తు మార్గమధ్యలో ఉన్న మహ్మద్షాపూర్ అటవీప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై బలవంతం చేశాడు.. కానీ ఆమె ఒప్పుకోవపోవడంతో ఆమెను కొట్టి అత్తపై అత్యాచారం జరిపాడు.. అనంతరం ఆమెను సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో ఇంటికి చేర్చాడు. అయితే జరిగిన విషయాన్ని కుమారులకు చెప్పిన ఆమె అదే రోజు రాత్రి దౌల్తాబాద్ పోలీ్సస్టేషన్లో ఫిర్యాదు చేసింది.. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు..
Mon Jan 19, 2015 06:51 pm