హైదరాబాద్: ఎంఆర్పీఎస్ నాయకులు మందకృష్ణ మాదిగకు సికింద్రాబాద్ కోర్టు షాక్ ఇచ్చింది. అనుమతి లేకుండా దీక్ష చేశారనే కేసులో మందకృష్ణ వేసిన బెయిల్ పిటీషన్ను కోర్టు తిరస్కరించింది. కాగా, ఇదే కేసులో మందకృష్ణ మినహా ఐదుగురికి బెయిల్ మంజూరు చేసింది. దీనిపై స్పందించిన మందకృష్ణ బెయిల్ కోసం జిల్లా కోర్టులో అప్పీలు చేస్తామని చెప్పారు. అనుమతి లేకుండా దీక్ష, రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారనే కారణంతో ఈనెల 2న చిలకలగూడ పోలీసులు మందకృష్ణను అరెస్ట్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm