హైదరాబాద్ : హైదరాబాద్లోని షేక్పేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహ వేడుక అనంతరం జరిపిన బరాత్లో మైనర్ బాలురు అత్యుత్సాహం ప్రదర్శించారు. తల్వార్లతో విన్యాసాలు చేస్తూ రెచ్చిపోయారు. ఈ క్రమంలో సయ్యద్ హమీద్ అనే తొమ్మిదో తరగతి విద్యార్థి మెడకి బలంగా తల్వార్ తగలడంతో తీవ్ర రక్తస్రావం జరిగి మృతి చెందాడు. ఇటీవల జరిగిన ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు 10 మంది మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. స్నేహితులు పిలిస్తే పెళ్లి బరాత్ కు వెళ్లి సయ్యద్ హమీద్ మృత్యువాత పడ్డాడని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో కత్తులు, తల్వార్ల వంటి ఆయుధాలతో యువకులు విన్యాసాలు చేస్తూ పదే పదే పట్టుబడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm