సంగారెడ్డి: ఇటుకల వ్యాపారి నుంచి కొందరు దుండగులు నగదును అపహరించుకుపోయారు. ఈ ఘటన సంగారెడ్డి ప్రధాన రోడ్డులోని ఎస్బీఐ వద్ద చోటుచేసుకుంది. చలానా కట్టేందుకు వెళ్లిన ఇటుకల వ్యాపారి దైవాదినం నుంచి దుండగులు రూ. 3 లక్షలు లాక్కెళ్లిపోయారు. చోరీపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm