గుంటూరు : అమరావతిలోని సచివాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో పలు అంశాలపై కేబినెట్ చర్చించనుంది. ఏపీ ట్రాన్స్కోలో 382 పోస్టులకు అనుమతి, ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలో మరో 406 పోస్టులకు అనుమతిచ్చే అంశంపై చర్చించనుంది. వీటితోపాటు మరికొన్ని అంశాలపై కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకోనుంది.
Mon Jan 19, 2015 06:51 pm