భూపాలపల్లి : కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరుపై రాష్ట్ర గవర్నర్ నరసింహన్ సంతృప్తి వ్యక్తం చేశారు. అన్నారం పంపుహౌజ్, సుందిళ్ల బ్యారేజ్ పనులను ఆయన పరిశీలించారు. పనులు సంతృప్తికరంగా సాగుతున్నాయని అభిప్రాయపడ్డారు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులను రోజువారీగా టార్గెట్ ఇచ్చి జరిపిస్తున్నట్టు ప్రాజెక్ట్లో పనిచేసే అధికారులు గవర్నర్కు తెలిపారు. కార్మికులకు సదుపాయాలు, వేతన భత్యాలు ఎలా ఇస్తున్నారో కూడా గవర్నర్ తెలుసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm