యమునానగర్: దేశంలో పాశ్చాత్య విష సంస్కృతులు పెరిగిపోతున్నాయి. కాస్త మందలిస్తే చాలు.. గురువులపై కక్ష పెంచుకుంటున్నారు. ప్రాణాలు తీసే స్థాయికి చేరుకుంటున్నారు. దేశంలోనే తొలిసారిగా ఓ ప్రిన్సిపాల్ను విద్యార్థి తుపాకీతో కాల్చి చంపాడు! హరియాణాలో జరిగిన ఈ ఘటనతో దేశం ఉలిక్కిపడింది. యమునానగర్కు చెందిన విద్యార్థి స్థానిక స్వామి వివేకానంద పబ్లిక్ స్కూలులో 12వ తరగతి చదువుతున్నాడు. హాజరు తగ్గడంతో ప్రిన్సిపాల్ రీతు చాబ్రా ఇటీవల అతన్ని సస్పెండ్ చేశారు. ఆమెపై కక్షగట్టిన విద్యార్థి శనివారం మధ్యాహ్నం తనతో తెచ్చుకున్న .32 బోర్గన్తో కాల్పులు జరిపాడు.
రీతు శరీరంలోకి మూడు బుల్లెట్లు దూసుకెళ్లాయి. అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించిన విద్యార్థిని స్కూలు సిబ్బంది పట్టుకొన్నారు. ప్రిన్సిపాల్ను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.తండ్రికి చెందిన లైసెన్స్ తుపాకీతో విద్యార్థి కాల్పులు జరిపినందున ఆయనపైనా కేసు నమోదు చేయనున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రిన్సిపాల్ తనను అవమానించారని, అందుకే కాల్పులు జరిపానని నిందితుడు చెప్పాడు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jan 21,2018 08:02AM