హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా ట్రెడ్లైసెన్స్ ఫీజు చెల్లించక పోవడంతోపాటు నిబంధనల ప్రకారం పరిశుభ్రత పాటించిన హోటల్పై జీహెచ్ఎంసీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలో నిర్వహించిన దాడుల్లో నానక్రాంగూడలోని ఫైవ్స్టార్ హోటల్ హయత్లో నిర్వహించిన తనిఖీల్లో అపరాధరుసం రూ.26వేలతో పాటు చాలా కాలంగా ట్రేడ్లైసెన్స్ ఫీజు చెల్లించకుండా హోటల్ నిర్వహిస్తునందుకు రూ.13లక్షల 65వేలు వసూల్ చేశారు. శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలో శనివారం ఉపకమిషనర్ మమత, ఏఎంహెచ్వో బిందుభార్గవి, ఫుడ్ఇన్స్పెక్టర్ మూర్తిరాజు, వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ వకీల్ సిబ్బందితో కలిసి పలు హోటల్స్ పై దాడులు నిర్వహించారు.
Mon Jan 19, 2015 06:51 pm