హైదరాబాద్: గత నాలుగేళ్లలో 29సార్లు ఢిల్లీకి వెళ్లానని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సాధించింది మాత్రం శూన్యమని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ అన్నారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా నియోజకవర్గాల పెంపుపై తప్ప విభజన హామీలపై చంద్రబాబు కేంద్రంతో చర్చించలేదని ఆరోపించారు. ప్రధాని మోడీ... లలిత్ మోడీ, నీరవ్ మోడీలకు లాభం చేకూరుస్తూ ఏపీకి అన్యాయం చేశారని మండిపడ్డారు. విభజన ఆశాస్త్రీయంగా జరిగిందని చెబుతున్న చంద్రబాబు.. కేంద్రంతో చర్చించి శాస్త్రీయంగా మార్చుకోవచ్చు కదా? అని ప్రశ్నించారు. విభజన ప్రక్రియను విమర్శిస్తూనే దానివల్ల లాభాలను రాష్ట్రం పొందుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. వెంటనే కేంద్రానికి మద్దతు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm